Sonia Gandhi Telangana Tour : సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
జూన్ 2న తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రముఖలతో పాటు ఉద్యమకారులను కూడా ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర గవర్నర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. రాజ్ భవన్ లో కలిసి రేపు జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. దశాబ్ధి వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.