నాట్య మయూరి.. పురివిప్పి ఆడిన నెమలి.. ఎంత పరవశమో!-kuchipudi dancer sandhya raju appreciated by ar rahman ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   నాట్య మయూరి.. పురివిప్పి ఆడిన నెమలి.. ఎంత పరవశమో!

నాట్య మయూరి.. పురివిప్పి ఆడిన నెమలి.. ఎంత పరవశమో!

HT Telugu Desk HT Telugu
Mar 14, 2022 06:49 PM IST

తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సంధ్య రాజు చేసిన వినూత్నమైన క్లాసికల్ పర్ఫామెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

sandhya raj
sandhya raj

ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్య రాజు నాట్యం సినిమా ద్వారా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నారు. తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సంధ్య రాజు మరొక వినూత్నమైన క్లాసికల్ పర్ఫామెన్స్ చేశారు.ప్రస్తుతం ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఉమెన్స్ డే సందర్భంగా సంధ్య రాజు ప్రముఖ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం ఫినామినల్ ఉమెన్ కి సంధ్య రాజు క్లాసికల్ పర్ఫామెన్స్ చేశారు.

సంధ్య రాజు నృత్యానికి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. తన ఫర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ వీడియో పై స్పందిస్తూ సంధ్య రాజు పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో మూడు లక్షలపైగా వ్యూస్ సంపాదించుకుంది. ఒక తెలుగు మహిళ క్లాసికల్ డాన్సర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం తెలుగు జాతి నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.

WhatsApp channel