Pawan Meets Balakrishna: వీరసింహారెడ్డిని కలిసిన వీర మల్లు.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్-pawan kalyan meets balkrishna on the sets of veera simha reddy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Meets Balakrishna: వీరసింహారెడ్డిని కలిసిన వీర మల్లు.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్

Pawan Meets Balakrishna: వీరసింహారెడ్డిని కలిసిన వీర మల్లు.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్

Maragani Govardhan HT Telugu
Dec 24, 2022 07:33 AM IST

Pawan Meets Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ స్పాట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో బాలయ్యను కలిసి కాసేపు ముచ్చటించారు.

బాలయ్యను కలిసిన పవన్ కల్యాణ్
బాలయ్యను కలిసిన పవన్ కల్యాణ్

Pawan Meets Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాఖ్యతగా ఫుల్ బిజీగా ఉంటున్నారు. అన్‌స్టాపబుల్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన తనదైన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఓ పాట మినహా సినిమా అంతా పూర్తి కావడంంతో ఆ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా వీరసింహారెడ్డి షూటింగ్ సెట్‌కు ఓ ప్రత్యేక అతిథి హాజరయ్యారు. అది ఎవరో కాదు.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. అక్కడే పవన్ కల్యాణ్ హరి హర వీర మల్లు షూటింగ్ కూడా జరుగుతుండటంతో బాలకృష్ణ సెట్స్‌కు పవర్‌స్టార్ విచ్చేశారు. అక్కడ బాలయ్యను కలిసిన పవర్ స్టార్.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. అంతేకాకుండా చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. పవర్‌స్టార్‌తో పాటు ఏఎం రత్నం, మైత్రీమూవీమేకర్స్ అధినేత రవిశంకర్, డైరెక్టర్ క్రిష్ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య-పవన్ కల్యాణ్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. దీంతో ఇరువురు పెద్ద స్టార్లు ఒకే వేదికపై ఉండటంతో ఇరువురి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కలయిక వారికి విజువల్ ట్రీట్‌లా మారింది.

ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి సినిమా షూటింగ్‌లో ఓ పాట మినహా మిగిలినదంతా పూర్తయింది. ఈ పాటను ప్రేమ్‌రక్షిత్ మాస్టార్ కొరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య, శృతిహాసన్‌పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. మరోపక్క హరి హర వీర మల్లు చిత్రానికి సంబంధించి కీలక ఘట్టాలను క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పీరియాడికల్ జోనర్‌లో రానుండగా.. వీరసింహారెడ్డి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా విడుదల కానుంది.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వీరసింహారెడ్డి చిత్రాన్ని నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. తమన్ సంగీతాన్ని సమకురుస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం