PM Modi meditation break: మే 30 నుంచి జూన్ 1 వరకు ప్రధాని మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన రాక్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించి, స్వామి వివేకానంద ధ్యానం చేసిన ధ్యాన మండపంలో ధ్యానంలో పాల్గొంటారు. లోక్ సభ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్తారు. ప్రధాని మోదీ (PM MODI) కన్యాకుమారి పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటన. ఆ సమయంలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు ఉండవు.