AP Exit Polls : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయవకాశాలపై ప్రముఖ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఎన్డీఏ కూటమికి 98-120 సీట్లు, వైసీపీకి 55-77 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ అవుతారని ఇండియా టుడే స్పష్టం చేసింది.
ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని పలు సర్వేలు వెల్లడించాయి. తాజాగా ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో కూటమిదే అధికారమని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరుస్తుందని 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే తెలిపింది. ఇక పార్టీల పరంగా ఓట్ షేర్ లో టీడీపీకి 42శాతం, వైసీపీకి 44 శాతం, జనసేనకు 7శాతం, బీజేపీకి 2శాతం, కాంగ్రెస్ కు 2 శాతం, ఇతరులు 3 శాతం ఓటింగ్ శాతం వస్తాయని అంచనా వేసింది. అలాగే లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ 13-15 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4-6 ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, వైసీపీ 2-4 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
సంబంధిత కథనం