Lok Sabha elections 2024 : లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ షురూ- నేడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
Lok Sabha elections phase 7 : లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసిన అనంతరం.. నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్తో పాటు లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి.

Lok Sabha elections phase 7 live updates : 44 రోజుల నుంచి జరుగుతున్న 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు నేటితో తెరపడనుంది. లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ ప్రక్రియ శనివారం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి సహా 57 నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాదు.. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
2024 లోక్సభ ఎన్నికలు..
543 సీట్లకుగాను.. 2024 ఏప్రిల్ 19న లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. జూన్ 1తో ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
కాగా.. 7వ దశ పోలింగ్లో భాగంగా.. 7 రాష్ట్రాల్లోని 57 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. అవి.. పంజాబ్ 13, ఉత్తర్ ప్రదేశ్ 13, బెంగాల్ 9, బిహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, ఛండీగఢ్ 3.
2024 Lok Sabha elections : అంతేకాదు.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిపోయిన 42 అసెంబ్లీ సీట్లకు కూడా నేడు పోలింగ్ జరగనుంది. నిన్న, మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న బీజేడీ- బీజేపీలు ఇప్పుడు ఎన్నికల రాజకీయాలతో తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్కు కీలకంగా మారింది! కాంగ్రెస్లో ఓటు రెబల్స్గా మారి, రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడిన వారు.. చివరికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
57 సీట్లల్లో వారణాసిపై అధిక ఫోకస్ ఉండనుంది! 2014 నుంచి ప్రధాని మోదీ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయనపై ఈసారి అజయ్ రాయ్ని బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ. వారణాసిలో మోదీ గెలుపు ఖాయమే! కానీ ఎంత మెజారిటీతో గెలుస్తారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్!
Lok Sabha elections in India 2024 : లోక్సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా హీట్వేవ్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. మరి దీని ప్రభావం పోలింగ్ శాతంపై ఏ మేరకు ఉంటుందో చూడాలి.
కాగా.. లోక్సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు సైతం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.
నేడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
Andhra Pradesh exit polls 2024 : ఇక మచ్ అవైటెడ్ టాపిక్గా మారిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన అరగంటకు.. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం నేటి సాయంత్రం బయటకు వస్తాయి. ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా నేడు వెలువడతాయి.
అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు.. వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అంచనాలు, అభిప్రాయాలను సేకరించి.. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అన్న విషయాలను అంచనా వేస్తుంది. ఇది.. పబ్లిక్ సెంటిమెంట్కి నిదర్శనంగా ఉంటుంది. అయితే.. గత కొన్నేళ్లుగా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ 2024పై ఆసక్తి ఎక్కువగానే ఉంది. అందుకే నేటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత కథనం