Gold Price Today July 4th : తగ్గిన బంగారం ధరలు.. కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం!-today gold price gold rate decrease and silver rate increase on 4th july 2024 hyderabad vijayawada vishakapatnam gold pr ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today July 4th : తగ్గిన బంగారం ధరలు.. కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం!

Gold Price Today July 4th : తగ్గిన బంగారం ధరలు.. కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం!

Anand Sai HT Telugu

Today Gold Price : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. జులై 3తో పోలిస్తే.. జులై 4న దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి.. రూ. 66,340 చేరింది. బుధవారం ఈ ధర రూ. 66,350గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 6,63,400 ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,634గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,370గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,380గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి రూ. 72,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,237గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,490.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,520గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,340 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,370గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల గోల్డ్​ ధర కాస్త పెరిగి.. రూ. 66,960గానూ, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,050గా ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.66,340గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,370గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,390గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,420గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,340గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,370గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మాత్రం గురువారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9160గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 91600గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 91,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 96,100 పలుకుతోంది. వంద గ్రాముల వెండి ధర రూ.9610గా నడుస్తోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91600.. బెంగళూరులో రూ. 90600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం ధరలు కాస్త పెరిగాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర 510 రూపాయలు పెరిగి.. రూ. 26,710గా ఉంది. క్రితం రోజు కంటే 510 రూపాయలు పెరిగింది.

హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,710గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.