Tata Motors price hike : భారీగా పెరగనున్న టాటా మోటార్స్​ వాహనాల ధరలు..-tata motors to hike passenger vehicle prices from feb 1 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Tata Motors To Hike Passenger Vehicle Prices From Feb 1

Tata Motors price hike : భారీగా పెరగనున్న టాటా మోటార్స్​ వాహనాల ధరలు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 28, 2023 06:24 AM IST

Tata Motors price hike 2023 : టాటా మోటార్స్​ వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆటో సంస్థ ఓ ప్రకటన చేసింది.

టాటా మోటార్స్​
టాటా మోటార్స్​ (Bloomberg)

Tata Motors price hike : టాటా మోటార్స్​ నుంచి.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది! తమ ప్యాసింజర్​ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ ప్రకటించింది. తమ మోడల్స్​పై దాదాపు 1.2శాతం ప్రైజ్​ హైక్​ తీసుకుంటున్నట్టు వెల్లడించింది. పెంచిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఒకటే కారణం..

ఇండియా ఆటో మార్కెట్​లో టాటా మోటార్స్​ ఎస్​యూవీలు, ఈవీ వాహనాలకు మంచి డిమాండ్​ ఉంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్​ను కస్టమర్ల ముందుకు తీసుకొస్తోంది ఈ ఆటో సంస్థ. అయితే.. వాహనాల ధరలను కూడా క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. ముడిసరకు ధరలు పెరుగుతున్నాయంటూ.. గతేడాది అంతా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్​, ఇప్పుడు కూడా అదే కారణం చెబుతోంది.

Tata Motors price hike 2023 : "ముడిసరకు ధరల భారాన్ని సంస్థ చాలా వరకు మోసింది. కస్టమర్లపై ఆ ప్రభావం పడకుండా చూసుకుంది. కానీ ఇప్పుడు కొంత భాగాన్ని కస్టమర్లపై వేయాల్సిన సమయం వచ్చింది. అందుకే ప్రైజ్​ హైక్​ తీసుకుంటున్నాము," అని శుక్రవారం ఓ అధికారిక ప్రకటన వెలువరిచింది టాటా మోటార్స్​.

తాజా పెంపుతో.. మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్న టాటా హారియర్​, టాటా సఫారీతో పాటు ఇతర మోడల్స్​ ధరలు పెరగనున్నాయి.

అన్ని ఆటో సంస్థలదీ ఇదే దారి..!

టాటా మోటార్స్​ ఒక్కటే వాహనాల ధరలను పెంచడం లేదు. దేశంలోని దాదాపు అన్ని ఆటో సంస్థలు ఇప్పటికే ప్రైజ్​ హైక్​ తీసుకున్నాయి. అవి కూడా.. 'ముడిసరకు ధరల'పైనే భారాన్ని మోపాయి.

Maruti Suzuki price hike news : మరో దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. వాహనాల ధరలను ఇప్పటికే పెరిగాయి. మోడల్​ ఆధారంగా గరిష్ఠంగా 1.1శాతం ప్రైజ్​ హైక్​ తీసుకుంది మారుతీ సుజుకీ. ఈ పెంచిన ధరలు జనవరి 16 నుంచే అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంకెంత పెంచుతారు?

'ముడిసరకు ధరల' పేరుతో ఏడాది కాలంగా వాహనాల ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచుకుంటూ పోయాయి ఆటో సంస్థ. దేశీయంగా మంచి డిమాండ్​ ఉండటం, ఆర్డర్​ బుక్​లో పెండింగ్​ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆటో సంస్థలు ఈ ధైర్యం చేయగలిగాయి. అందుకు తగ్గట్టుగానే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్​గా ఇండియా అవతరించింది. కానీ ఇలా ఇంకెన్నాళ్లు పెంచుతాయి? అని ప్రశ్నలు ఇప్పుడిప్పుడే ఉత్పన్నమవుతున్నాయి. మాటిమాటికి వాహనాల ధరలు పెంచేస్తే.. డిమాండ్​ తగ్గిపోయే ప్రమాదం ఉందని, కొత్త కారు తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tata Motors price hike news : మరి వాహనాల ప్రైజ్​ హైక్​కు ఎప్పుడు ముగింపు పడుతుందో వేచి చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం