AP Job Mela : విశాఖ, నందికొట్కూరు, తిరుపతిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 27న విశాఖ, తిరుపతిలో, 30న నందికొట్కూరులో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
వివిధ ప్రైవేట్ కంపెనీల్లో 250 ఉద్యోగాలకు ఈ నెల 27న విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, ఐటిఐ ఫిట్టర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలకు హాజరుకావాలని తెలియజేశారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు గల నిరుద్యోగులు అర్హత సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. విశాఖలో జరిగే జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలకు 9948768778 నంబర్ ని సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://employment.ap.gov.in/ వెబ్ సైట్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం