Andhra Pradesh News Live December 17, 2024: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల మార్చి నెల కోటా షెడ్యూల్ విడుదల-ఏ తేదీల్లో ఏయే టికెట్లంటే?
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 17 Dec 202405:28 PM IST
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల 2025 మార్చి నెల కోటా డిసెంబర్ 18 నుంచి విడుదల చేయనున్నారు. భక్తులు ముందుగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. లడ్డీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి.
Tue, 17 Dec 202405:09 PM IST
Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
Tue, 17 Dec 202404:37 PM IST
Ration Rice Smuggling : ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై వైసీపీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం పట్టివేతలో ద్వారంపూడి పేరు వినబడగా...తనకు సంబంధంలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గోదాములో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పేర్ని నాని కుటుంబం పేరు తెరపైకి వచ్చింది.
Tue, 17 Dec 202402:57 PM IST
APSRTC Allowance : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసింది. నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు అదనపు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
Tue, 17 Dec 202402:31 PM IST
CM Chandrababu : టెక్నాలజీ సాయంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరైన సీఎం...ఎయిమ్స్ లో రూ.10కే అందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నారన్నారు.
Tue, 17 Dec 202401:50 PM IST
AP Paper Leak : ఏపీలో పదో తరగతి పేపర్ లీక్ కలకలం రేపింది. టెన్త్ సమ్మేటివ్ పరీక్ష మ్యాథ్స్ పేపర్ ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ పరీక్షను రద్దు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టింది.
Tue, 17 Dec 202411:21 AM IST
Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. గర్భవతి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ అయిన భర్త మరణించాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
Tue, 17 Dec 202411:02 AM IST
- Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే ఆర్మీ జవాన్ అయిన భర్త మృతి చెందారు. గర్భవతి అయిన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి, తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఆయన మృతిచెందారు. ఈ ప్రమాదంలో భార్యకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
Tue, 17 Dec 202410:47 AM IST
Kakinada Ration Rice : కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్థారించామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. పోర్టులో ఇంకా 12 వేల టన్నుల బియ్యం లోడ్ చేయాల్సిన ఉందన్నారు. వీటిలో పీడీఎస్ బియ్యం లేవని నిర్థారించాకే లోడింగ్కు అనుమతిస్తామన్నారు.
Tue, 17 Dec 202410:05 AM IST
- AP Pensions Cancellation: ఏపీలో అనర్హులకు పెన్షన్ల రద్దు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ మేరకు సెర్ప్ సీఈఓ వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులో చేపట్టిన తనిఖీల్లో మొత్తం 10వేల పెన్షన్లలో 563మంది అనర్హులను గుర్తించారు. ఆ పెన్షన్లను రద్దు చేయాలని ఆదేశించారు.
Tue, 17 Dec 202407:36 AM IST
- AP Weather Latest Update: నైరుతి బంగాళాఖాతంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రానున్న రెండు రోజులలో అల్పపీడనం బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది.
Tue, 17 Dec 202406:42 AM IST
- Minister Saradhi: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి వేదికను పంచుకోవడంపై మంత్రి కొలుసు పార్థసారథి వివరణ ఇచ్చారు. జోగి రమేష్ ఆ సమావేశానికి వస్తున్నాడని తనకు తెలియదని, వైసీపీ వారిని పిలుస్తున్నామని నిర్వాహకులు తనకు చెప్పలేదన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు ప్రకటించారు.
Tue, 17 Dec 202405:43 AM IST
- DNA Test for VSR: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, అడ్వకేట్ సుభాష్లపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్మోహన్ మంత్రి లోకేష్కు విజ్ఞప్తి చేశారు.అక్రమాలను బయటపెట్టినందుకు తనను బదిలీ చేయించారని ఆరోపించారు.వందల కోట్ల భూములు అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tue, 17 Dec 202403:54 AM IST
- Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్యకు గురైంది.భవానీ మాలధారణతో ఉన్న నిందితుడు ఆమె కత్తితో దాడి చేసి హతమార్చాడు.చప్పుడుకు నిద్ర లేచిన పిల్లలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు.
Tue, 17 Dec 202403:28 AM IST
- AP TG Winter Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 3.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 5.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జనం చలి గాలులకు వణికి పోతున్నారు.
Tue, 17 Dec 202401:45 AM IST
- AP Registration Charges: ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ విలువల సవరణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. జనవరి 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పెరగనుంది. 2022లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలను ప్రభుత్వం సవరించింది.