SCR Special Trains: నర్సాపూర్, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లు - ఆగే స్టేషన్లు ఇవే
Special Trains From Andhrapradesh: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా నర్సాపూర్ - యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
narasapur yesvantpur trains: నర్సాపూర్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సెప్టెంబర్ 4వ తేదీన నర్సాపూర్ నుంచి 03.10 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10.50 నిమిషాలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది.
yesvantpur narasapur special trains: ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 5వ తేదీన 03.50 గంటలకు స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది. ఆ తర్వాత రోజు అంటే 6వ తేదీన ఉదయం 08.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
ఆగేది ఈ స్టేషన్లలోనే...
ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల్, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైళ్లలో 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
Secunderabad to Yesvantpur Trains: మరోవైపు సికింద్రాబాద్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 2 వ తేదీన రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు 10.30 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది. ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 3వ తేదీన సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 7.30 గంటలకు గమ్యస్థలానికి చేరుతుంది.
ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
Nanded Tirupati Special Trains: నాందేడ్ నుంచి తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు సెప్టెంబర్ 3వ తేదీన నాందేడ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 4వ తేదీన 09.10 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్ పుర్ణ, పర్బాణీ, గంగాఖేర్, పర్లివైజ్ నాథ్, లాటర్ రోడ్, ఉద్గిరి, బల్కి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూరు, సెరం, చిత్తపూర్, సూలేహల్లీ, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయంరోడ్డు, ఆదోని, గుంతకల్లు, గూటి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.