విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇకపై కృష్ణమ్మ అలలపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు. శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్ లో భాగంగా… మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది. జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ సురక్షితంగా చేరుకుంది. ట్రయల్ రన్ విజయవంతం కావటంతో… అధికారికంగా ప్రారంభించటానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది.