Endowment Department : గణేశ్ మండపాలకు ఎలాంటి రుసుము వసూలు చేయట్లేదు-no fee to setting up ganesh chaturthi pandals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  No Fee To Setting Up Ganesh Chaturthi Pandals

Endowment Department : గణేశ్ మండపాలకు ఎలాంటి రుసుము వసూలు చేయట్లేదు

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 06:01 PM IST

Ganesh Chaturthi Pandals : గణేశ్ మండపాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని దేవదాయ శాఖ కమిషనర్ జవహర్‌లాల్‌ చెప్పారు. రుసుము వసూలు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నట్టుగా తెలిపారు.

గణేశుడి మండపాలకు రుసుము లేదు
గణేశుడి మండపాలకు రుసుము లేదు (Pixabay)

గణేశ్ మండపాలకు రుసుము వసూలు చేయట్లేదని.. దేవదాయ శాఖ కమిషనర్ జవహర్ లాల్ స్పష్టం చేశారు. ఎవరైనా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని తెలిపారు. అదంతా ఫేక్ అన్నారు. మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదన్నారు. చట్టపరంగా తీసుకోవలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించాలని సూచించారు. ఎవరైనా మండపాల కోసం రుసుము వసూలు చేస్తే.. ఫిర్యాదు చేయాలని కోరారు.

అనుమతులు తీసుకోవాలి

ఈ నెల 31 నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణేష్‌ మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు నిబంధనలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Guidelines For Setting Up Ganesh Pandals : విగ్రహం సైజు, బరువు, ఉత్సవం ఎన్ని రోజులు నిర్వహిస్తారు. నిమజ్జనం చేసే తేదీ, కమిటీ సభ్యుల వివరాలను ముందుగానే తెలియజేయాలి.

బలవంతపు చందాలు వసూళ్లు చేయరాదు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే డయల్‌ 100 గానీ ఫిర్యాదు చేయవచ్చు.

మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేందుకు ప్రాధాన్యమివ్వాలి.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, మందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వహించరాదు.

కమిటీ సభ్యులు రాత్రి సమయంలో మండపం వద్ద కాపలాగా ఉండాలి.

శబ్దకాలుష్యం విషయంలో పీసీబీ నియమాలు విధిగా పాటించాలి.

ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి.

మండపాల ప్రదేశం వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలిగించకూడదు.

విగ్రహాల ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు వేసినా, డ్యాన్సులు చేసినా కఠిన చర్యలు ఉంటాయి.

మందుగుండు సామగ్రి కాల్చరాదు.

వినాయక నిమజ్జన ఊరేగింపు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.

ఘర్షణలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తారు.

IPL_Entry_Point