SCR Special Trains: నర్సాపూర్, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లు - వివరాలివే-4 special trains between narasapur yesvantpur full details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  4 Special Trains Between Narasapur Yesvantpur Full Details Are Here

SCR Special Trains: నర్సాపూర్, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లు - వివరాలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 08, 2022 06:27 AM IST

Special Trains From Andhrapradesh: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా నర్సాపూర్ - యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

నర్సాపూర్ కు ప్రత్యేక రైళ్లు,
నర్సాపూర్ కు ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

narasapur yesvantpur trains: నర్సాపూర్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సెప్టెంబర్ 9, 11వ తేదీల్లో నర్సాపూర్ నుంచి 03.20 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది.

yesvantpur narasapur special trains: ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.

ఆగేది ఈ స్టేషన్లలోనే...

ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట,దోనకొండ, మార్కాపూర్ రోడ్, నంద్యాల్, డోన, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లలో 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

తిరుపతికి ప్రత్యేక రైళ్లు

tirupati special trains: హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్‌లో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వన్ వే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే.

హైదరాబాద్ నుంచి తిరుపతికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

వెళ్లే రూట్..

ఈ ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభమైంది. తిరుపతి వెళ్లాలనుకునేవారు టికెట్ రిజర్వేషన్ చేయొచ్చు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు

IPL_Entry_Point