తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy Padayatra: నలుగురు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇస్తాం

Revanth Reddy Padayatra: నలుగురు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇస్తాం

22 February 2023, 16:37 IST

  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో మాట్లాడిన ఆయన... బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు ఆడబిడ్డలకు మంత్రిపదవవులు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్య రావాలంటే... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే...బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. కుక్క కరిచి చిన్నారి చనిపోతే కనీసం అధికార పార్టీ నేతలు పరామర్శించలేదని దుయ్యబట్టారు. కొందరు మంత్రులు రేసింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ జల్సాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.