తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  శాంతి మంత్రం.. Unoలో భారత్ 10-పాయింట్ ఫార్ములా!

శాంతి మంత్రం.. UNOలో భారత్ 10-పాయింట్ ఫార్ములా!

08 September 2022, 21:21 IST

ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక బృందాలు ఎదుర్కొంటున్న భద్రత, కార్యాచరణ సవాళ్లను పరిష్కరణకు భారతదేశం 10-పాయింట్ ఫార్ములాను సమర్పించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో UN శాంతి పరిరక్షక మిషన్‌కు అనుబంధంగా ఉన్న ఇద్దరు BSF సిబ్బంది మరణించిన నేపథ్యంలో భారత్ ఈ ఫార్ములాను రూపొందించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ భద్రతా మండలి బ్రీఫింగ్‌లో ప్రసంగిస్తూ ఈ ప్రతిపాదనను వివరించారు. ఘర్షణ ప్రాంతాలలో పెరుగుతున్న హింస నేపథ్యంలో ఇటువంటి మిషన్లు మరింత సవాలుగా మారుతున్నాయన్నారు.