తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ‘Heart-wrenching Tragedy’: 89 మంది జలసమాధి

‘Heart-wrenching tragedy’: 89 మంది జలసమాధి

24 September 2022, 20:15 IST

‘Heart-wrenching tragedy’: మధ్యదరా సముద్రంలో గురువారం అత్యంత దారుణమైన విషాదం చోటు చేసుకుంది. లెబనాన్ నుంచి ఇటలీకి అక్రమంగా వలస వెళ్తున్న 89 మంది సిరియా తీరంలో జల సమాధి అయ్యారు. వారు ప్రయాణిస్తున్న చిన్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లెబనాన్ నుంచి సిరియా మీదుగా దాదాపు 150 మందితో ఈ చిన్న బోటు ఇటలీకి వెళ్తోంది. సిరియా తీరం సమీపంలో ఇది సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 89 మంది చనిపోగా, 25 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ వలసదారుల్లో పాలస్తీనా, లెబనాన్, సిరియా పౌరులు ఉన్నారు. మృతుల్లో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఈ హృదయ విదారక విషాదాన్ని ఈ వీడియోలో చూడండి..