తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Coronavirus | 24 గంటల్లో 412 కొత్త కరోనా కేసులు.. ముగ్గురు మృతి

Coronavirus | 24 గంటల్లో 412 కొత్త కరోనా కేసులు.. ముగ్గురు మృతి

26 December 2023, 13:36 IST

  • దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల పెరుగుదల మెుదలైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కరోనా బారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీరప్రాంతం కేరళలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువ కేసులు ఆ రాష్ట్రంలోనే బయటపడుతున్నాయని పేర్కొంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,170 కు చేరుకున్నాయి.