jagannanna ragijava | జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావ

21 March 2023, 15:50 IST

చ‌దువుకునే పిల్ల‌ల‌కు శారీర‌క ఆరోగ్యం కోసం గోరుముద్ద ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం జగన్ తెలిపారు. పథకంలో భాగంగా విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రాగి జావను అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావను చేర్చినట్లు వివరించారు.ఒకటి నుంచి పదో తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రాగి జావా అందిస్తామని చెప్పారు.