
Kidney racket in Vijayawada | రూ.30 లక్షలు ఆశ చూపి.. కిడ్నీ కొట్టేసిన ముఠా
- విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా మోసం మరోసారి బయట పడింది. ఆర్థిక ఇబ్బందితో కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు గుంటూరుకు చెందిన మధుబాబు అనే యువకుడు. అయితే కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే లక్షా పదివేలు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు.