తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayawada | రాయపాడు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లను రద్దు

Vijayawada | రాయపాడు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లను రద్దు

23 February 2024, 12:35 IST

  • విజయవాడ-సికింద్రాబాద్‌ మెయిన్‌ లైన్‌లో రాయపాడు సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ సీ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ విషయం తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. అయితే ఈ కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు.