తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Ys Jagan At Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

CM YS Jagan at Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

06 March 2024, 17:28 IST

  • ప్రతిష్ఠాత్మక వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్‌ జాతికి అంకితం చేశారు. బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన జగన్.. ఈ మేరకు ప్రాజెక్టును ప్రారభించారు. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్న మొదలు పెడితే ఇప్పుడు ఆయనకు కొడుకుగా నేను పూర్తి చేశానని జగన్ అన్నారు. నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆనదించారు. ఆసియాలోనే అత్యంత పొడవైన వెలిగొండ సొరంగాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ఫైలాన్‌ ను జగన్‌ అవిష్కరించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు రెండో టెన్నెల్‌ ను పరిశీలించారు. ఆ తరువాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ జాతికి అంకితం చేశారు.