తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య- స్కూడ్రైవర్ తో కళ్లు పొడిచి, నరాలు కోసేసి!

Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య- స్కూడ్రైవర్ తో కళ్లు పొడిచి, నరాలు కోసేసి!

11 June 2023, 16:43 IST

    • Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. యువతిని హత్య చేసిన దుండగులు గ్రామం సమీపంలోని నీటి కుంటలో పడేశారు.
వికారాబాద్ లో యువతి దారుణ హత్య
వికారాబాద్ లో యువతి దారుణ హత్య

వికారాబాద్ లో యువతి దారుణ హత్య

Vikarabad Crime : వికారాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా హత్య చేశారు. పరిగి మండలం కాళ్లాపూర్ లో శిరీష(19) అనే యువతి శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం గ్రామ సమీపంలోని నీటకుంటలో యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. యువతి మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో కుటుంబ సభ్యులు ఎవరో హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని హత్య చేసి గ్రామ శివారులోని నీటి కుంటలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Yadadri Temple : యాదాద్రిలో 'ప్లాస్టిక్' పై నిషేధం - భక్తుల డ్రెస్ కోడ్ పై కీలక నిర్ణయం...!

Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

చేతుల నరాలు కట్ చేసి, కళ్లు పొడిచి

వికారాబాద్ జిల్లాలో అత్యంత దారుణ రీతిలో యువతి హత్యకు గురైంది. యువతి కాళ్లు, చేతుల నరాలు కోసేసి, కళ్లు రెండు పెకలించిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని హత్య చేసిన అనంతరం నీటి కుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని నీటి కుంటలో గుర్తించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 19 ఏళ్ల శిరీష ఇంటర్ పూర్తి చేసుకుని నర్సింగ్ కోర్సులో చేరింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో శిరీష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. శిరీష హత్యకు గురైందన్న సమాచారంతో గ్రామంలో విషాదం అలముకుంది. శిరీషను హత్య చేసిన సమయంలో స్కూడ్రైవర్ తో కళ్లల్లో పొడిచినట్టు తెలుస్తోంది. ఇంత దారుణంగా ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికుందన్న పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెంగళూరులో గోదావరి ఖని యువతి హత్య

ఇటీవల బెంగుళూరులో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆకాంక్షను ఆమె లవర్ దారుణంగా హత్య చేశాడు. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న యువతిని ప్రియుడు అర్పిత్ దారుణంగా చంపేశాడు. యువతి హైదరాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు అర్పిత్ తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆకాంక్షను అర్పిత్ గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు నిర్థారించారు. యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు గోదావరిఖనికి తరలించారు. కన్నబిడ్డ మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. యువతిపై మీదనే ఆ కుటుంబం ఆధారపడిఉంది.

తదుపరి వ్యాసం