తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Notification : అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC Notification : అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Anand Sai HT Telugu

12 September 2022, 19:10 IST

    • నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న కమిషన్ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మెుత్తం 833 పోస్టులను భర్తీ చేయనున్నారు. 28 సెప్టెంబర్ 2022 నుంచి 21 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం 23 సెప్టెంబర్ 2022న టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండనుంది.

ట్రెండింగ్ వార్తలు

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

<p>టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్</p>

టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇటీవలే మున్సిపల్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాలి.

మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టులకు కొన్ని రోజుల క్రితం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 13 నుంచి దరఖాస్తులు చేయాలి. మొత్తం 23 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అక్టోబర్ 10న దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1 లో 17 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 2 లో 6 పోస్టులుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు జీతం ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అయి ఉండాలి. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారుపోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఇటీవలే ఏఈఈ ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. మొత్తం 1540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ముఖ్య వివరాలు:

AEE Jobs Details: అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు

ఏఈఈ సివిల్ విభాగం 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147 పోస్టులు

టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో మొత్తం 704 ఖాళీలు (సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100)

ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 ఉద్యోగాలు

ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులు

అర్హతలు - సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి అర్హతులు ఉంటాయి.

వయోపరిమితి - అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం - నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణ - సెప్టెంబర్ 22, 2022

తుది గడువు - 14, అకోబ్టర్, 2022

పరీక్ష - డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం

తదుపరి వ్యాసం