తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  India Post Gds 2023 : పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలోని ఖాళీలు ఎన్నంటే?

India Post GDS 2023 : పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలోని ఖాళీలు ఎన్నంటే?

HT Telugu Desk HT Telugu

29 January 2023, 14:03 IST

    • India Post Recruitment 2023: ఇండియా పోస్ట్ నుంచి మరోసారి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ పరిధిలోని పోస్టుల వివరాలు చూస్తే...
ఏపీ తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీ తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు

ఏపీ తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు

India Post GDS 2023 Jobs in AP and Telangana: ఇండియా పోస్ట్... దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 2480, తెలంగాణ పరిధిలో 1266 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఈ 40,889 ఖాళీలకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి indiapostgdsonline.gov.in సందర్శించవచ్చు. మరోవైపు ఈ పోస్టులకు జనవరి 27 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

మొత్తం ఖాళీల సంఖ్య: 40,889.

భర్తీ చేసే పోస్టులు - గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/

డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు

తెలంగాణ- 1266

ఆంధ్రప్రదేశ్- 2480

అసోం- 407

బిహార్- 1461

ఢిల్లీ - 46

ఛత్తీస్‌గఢ్-1593

గుజరాత్- 2017

హర్యానా- 354

హిమాచల్‌ప్రదేశ్- 603

జమ్ము కశ్మీర్- 300

ఝార్ఖండ్- 1590

కర్ణాటక- 3036

కేరళ- 2462

మధ్యప్రదేశ్- 1841

మహారాష్ట్ర- 2508

నార్త్ ఈస్టర్న్- 923

ఒడిశా- 1382

పంజాబ్- 766

రాజస్థాన్- 1684

తమిళనాడు- 3167

ఉత్తర ప్రదేశ్- 7987

ఉత్తరాఖండ్- 889

పశ్చిమ్ బెంగాల్- 2127

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 16.02.2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు తుది గడువు: 16.02.2023.

తదుపరి వ్యాసం