తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  President Murmu: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Murmu: హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

HT Telugu Desk HT Telugu

04 July 2023, 11:46 IST

    • President Murmu: అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకున్నరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఎం కేసీఆర్‌ స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రంజరిగే అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. 
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్
రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్

రాష్ట్రపతికి స్వాగతం పలుకుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్

President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

మంగళవారం సాయంత్రం గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ద్రౌపది ముర్ము హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి నిలయంలో పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి సమీక్షించనున్నారు.

సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి ద్రౌపదీముర్ము చేరుకుని అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. గచ్చిబౌలిలో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.

సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే 'అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల' ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నాగపూర్ వెళ్లనున్నారు.

తదుపరి వ్యాసం