తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మహా మృత్యుంజయ మంత్రం నిత్యం పఠిస్తే ఏ ఆపదైనా తొలగుతుంది

మహా మృత్యుంజయ మంత్రం నిత్యం పఠిస్తే ఏ ఆపదైనా తొలగుతుంది

19 July 2023, 13:11 IST

Maha Mrityunjaya Mantra: మహా మృత్యుంజయ మంత్రం రోజూ పఠించడం వల్ల ఎంత పెద్ద ఆపదనైనా మీరు సులువుగా ఎదుర్కోవచ్చు.

  • Maha Mrityunjaya Mantra: మహా మృత్యుంజయ మంత్రం రోజూ పఠించడం వల్ల ఎంత పెద్ద ఆపదనైనా మీరు సులువుగా ఎదుర్కోవచ్చు.
మహామృత్యుంజయ మంత్రం భారతీయ పురాణాలలో అత్యంత ముఖ్యమైన మంత్రాలలో ఒకటి. శివునికి సంబంధించిన, ఈ మంత్రం అర్థం మరణాన్ని జయించడం. ఈ మంత్రం మార్కెండేయ మహర్షి ప్రబోధించారు. ఒకప్పుడు చంద్రుడు దక్ష రాజు చేత శాపగ్రస్తుడై ఇబ్బంది పడుతాడు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి చంద్రుని కోసం ఈ మంత్రాన్ని దక్షుని కుమార్తె సతికి ఇచ్చాడు.
(1 / 6)
మహామృత్యుంజయ మంత్రం భారతీయ పురాణాలలో అత్యంత ముఖ్యమైన మంత్రాలలో ఒకటి. శివునికి సంబంధించిన, ఈ మంత్రం అర్థం మరణాన్ని జయించడం. ఈ మంత్రం మార్కెండేయ మహర్షి ప్రబోధించారు. ఒకప్పుడు చంద్రుడు దక్ష రాజు చేత శాపగ్రస్తుడై ఇబ్బంది పడుతాడు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి చంద్రుని కోసం ఈ మంత్రాన్ని దక్షుని కుమార్తె సతికి ఇచ్చాడు.
మరొక నమ్మకం ప్రకారం ఈ పవిత్ర మంత్రాన్ని శివుడు శుక్రాచార్యుల వారికి ఇచ్చాడు. అతను దానిని ఋషి దధీచికి బోధించాడు, అతడు దానిని క్షువ చక్రవర్తికి అందించాడు, అతని ద్వారా ఇది పవిత్రమైన శివ పురాణానికి చేరుకుంది.
(2 / 6)
మరొక నమ్మకం ప్రకారం ఈ పవిత్ర మంత్రాన్ని శివుడు శుక్రాచార్యుల వారికి ఇచ్చాడు. అతను దానిని ఋషి దధీచికి బోధించాడు, అతడు దానిని క్షువ చక్రవర్తికి అందించాడు, అతని ద్వారా ఇది పవిత్రమైన శివ పురాణానికి చేరుకుంది.
మహా మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం,ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. ఇది ప్రాణాలను రక్షించే మంత్రం. భక్తితో, విశ్వాసంతో, చిత్తశుద్ధితో జపించాలి. దీనిని జపించడానికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. అంటే ఉదయం 4 గంటల సమయంలో మంత్రాన్ని పఠించాలి. ఈ సమయంలో ప్రతికూలతను దూరం చేసే దైవిక శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి.
(3 / 6)
మహా మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం,ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. ఇది ప్రాణాలను రక్షించే మంత్రం. భక్తితో, విశ్వాసంతో, చిత్తశుద్ధితో జపించాలి. దీనిని జపించడానికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తం. అంటే ఉదయం 4 గంటల సమయంలో మంత్రాన్ని పఠించాలి. ఈ సమయంలో ప్రతికూలతను దూరం చేసే దైవిక శక్తి తరంగాలు ఉత్పన్నమవుతాయి.
వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలని పెద్దలు చెబుతారు. ఇది నొప్పిని తగ్గిస్తుంది. శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ప్రమాదాలు, ఆకస్మిక మరణం, దురదృష్టం లేదా అలాంటి ఏదైనా అనూహ్య ఘటనల నుంచి రక్షణ లభిస్తుంది.
(4 / 6)
వ్యాధులతో బాధపడుతున్న వారు వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలని పెద్దలు చెబుతారు. ఇది నొప్పిని తగ్గిస్తుంది. శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ప్రమాదాలు, ఆకస్మిక మరణం, దురదృష్టం లేదా అలాంటి ఏదైనా అనూహ్య ఘటనల నుంచి రక్షణ లభిస్తుంది.
ఈ పవిత్ర మంత్రం ఆరోగ్యం, సంపద, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. విభూతిని శరీరంపై పెట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే హవనంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఇది వైద్యం చేసే శక్తికి ప్రసిద్ధి చెందింది.
(5 / 6)
ఈ పవిత్ర మంత్రం ఆరోగ్యం, సంపద, దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. విభూతిని శరీరంపై పెట్టుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే హవనంలో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఇది వైద్యం చేసే శక్తికి ప్రసిద్ధి చెందింది.
ఆఫీసుకు వెళ్లే ముందు, మందులు వేసుకునే ముందు లేదా పడుకునే ముందు ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లు జపించాలి. మంచి ఆరోగ్యం, సంపద కోసం ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించండి. శివునిపై విశ్వాసం ఉంచండి. అతను మిమ్మల్ని అన్ని కష్టాల నుండి ఖచ్చితంగా రక్షిస్తాడు.
(6 / 6)
ఆఫీసుకు వెళ్లే ముందు, మందులు వేసుకునే ముందు లేదా పడుకునే ముందు ఈ మంత్రాన్ని కనీసం తొమ్మిది సార్లు జపించాలి. మంచి ఆరోగ్యం, సంపద కోసం ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించండి. శివునిపై విశ్వాసం ఉంచండి. అతను మిమ్మల్ని అన్ని కష్టాల నుండి ఖచ్చితంగా రక్షిస్తాడు.

    ఆర్టికల్ షేర్ చేయండి