తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Procession Of Surya Prabha Vahanam On Occasion Of Ratha Saptami At Tirumala

Ratha Saptami : తిరుమలలో రథసప్తమి సందర్భంగా.. ప్రారంభమైన స్వామివారి వాహన సేవలు..

28 January 2023, 9:38 IST

Ratha Saptami at Tirumala : తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా.. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి. 

  • Ratha Saptami at Tirumala : తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా.. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి. 
తిరుమలలో ఈరోజు (శనివారం) ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ఘనంగా మొదలయ్యాయి.
(1 / 8)
తిరుమలలో ఈరోజు (శనివారం) ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ఘనంగా మొదలయ్యాయి.
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో.. స్వామివారు ఊరేగారు. పూల అలంకరణలో స్వామివారు మరింత అందంగా భక్తులకు దర్శనమిచ్చారు.
(2 / 8)
రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో.. స్వామివారు ఊరేగారు. పూల అలంకరణలో స్వామివారు మరింత అందంగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయించనున్నారు.
(3 / 8)
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం చేయించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
(4 / 8)
అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
(5 / 8)
వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపులో.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 
(6 / 8)
శ్రీవారి ఆలయ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపులో.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 
ఊరేగింపులో భాగంగా.. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేశారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. విఐపి, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
(7 / 8)
ఊరేగింపులో భాగంగా.. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేశారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. విఐపి, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
ఈ ఊరేగింపులో.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
(8 / 8)
ఈ ఊరేగింపులో.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి