తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lokesh Padayatra: అల్లుడి పాదయాత్రలో బాలయ్య జోరు... కార్యకర్తల్లో జోష్

Lokesh Padayatra: అల్లుడి పాదయాత్రలో బాలయ్య జోరు... కార్యకర్తల్లో జోష్

07 April 2023, 14:40 IST

Balakrishna in Nara Lokesh Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. లోకేశ్ కు మద్దతుగా కాసేపు నడిచిన బాలకృష్ణ… కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 

  • Balakrishna in Nara Lokesh Padayatra: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. లోకేశ్ కు మద్దతుగా కాసేపు నడిచిన బాలకృష్ణ… కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. 
లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టితో 63వ రోజుకు చేరింది. యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ కాసేపు లోకేశ్ తో కలిసి నడించారు. ప్రజలు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు బాలకృష్ణ.
(1 / 4)
లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టితో 63వ రోజుకు చేరింది. యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ కాసేపు లోకేశ్ తో కలిసి నడించారు. ప్రజలు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు బాలకృష్ణ.
ఈ సందర్భంగా మామ, అలుడు ప్రత్యేక టోపీ ధరించారు. గంజాయి వద్దు బ్రో అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ... వైసీపీ ప్రభుతవంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంజాయికి ఏపీని అడ్డా చేశారంటూ ఫైర్ అయ్యారు.
(2 / 4)
ఈ సందర్భంగా మామ, అలుడు ప్రత్యేక టోపీ ధరించారు. గంజాయి వద్దు బ్రో అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ... వైసీపీ ప్రభుతవంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంజాయికి ఏపీని అడ్డా చేశారంటూ ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవా చేశారు బాలకృష్ణ. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని బాలయ్య విమర్శించారు. మద్యం, డ్రగ్స్ ను యువతలోకి పంపి వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. . రాష్ట్రంలో టీడీపీ మళ్లీ వచ్చే శుభసూచకాలు చాలా కనిపిస్తున్నాయని అన్నారు బాలయ్య.  
(3 / 4)
ముఖ్యమంత్రి పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవా చేశారు బాలకృష్ణ. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని బాలయ్య విమర్శించారు. మద్యం, డ్రగ్స్ ను యువతలోకి పంపి వారిని బానిసలుగా చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. . రాష్ట్రంలో టీడీపీ మళ్లీ వచ్చే శుభసూచకాలు చాలా కనిపిస్తున్నాయని అన్నారు బాలయ్య.  
బాలకృష్ణ పాదయాత్రలో పాల్గొనటంతో కార్యకర్తలు, నేతల్లో జోష్ నెలకొంది. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. 
(4 / 4)
బాలకృష్ణ పాదయాత్రలో పాల్గొనటంతో కార్యకర్తలు, నేతల్లో జోష్ నెలకొంది. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి