తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

27 June 2023, 10:28 IST

దేశంలోని 80శాతం ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల కదలికలో కొత్త పాటర్న్​ ఏర్పడిందని పేర్కొంది.

  • దేశంలోని 80శాతం ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల కదలికలో కొత్త పాటర్న్​ ఏర్పడిందని పేర్కొంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరాయని స్పష్టం చేసింది.
(1 / 6)
దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. దేశంలోని ఉత్తర, వాయువ్య ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరాయని స్పష్టం చేసింది.(PTI)
"తూర్పు- మధ్య, వాయువ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలతో జోరుగా వర్షాలు పడొచ్చు. మరోవైపు గుజరాత్​, పంజాబ్​, హరియాణాల్లోని మరికొన్ని ప్రాంతాలకు 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుతాయి," అని ఐఎండీ వెల్లడించింది.
(2 / 6)
"తూర్పు- మధ్య, వాయువ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలతో జోరుగా వర్షాలు పడొచ్చు. మరోవైపు గుజరాత్​, పంజాబ్​, హరియాణాల్లోని మరికొన్ని ప్రాంతాలకు 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు చేరుతాయి," అని ఐఎండీ వెల్లడించింది.(PTI)
. "నైరుతి రుతుపవనాలు.. ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్​లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్​, హరియాణా, పంజాబ్​, జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలను తాకంది," అని ఐఎండీ స్పష్టం చేసింది.
(3 / 6)
. "నైరుతి రుతుపవనాలు.. ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్​లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్​, హరియాణా, పంజాబ్​, జమ్ముకశ్మీర్​లోని కొన్ని ప్రాంతాలను తాకంది," అని ఐఎండీ స్పష్టం చేసింది.(PTI)
ఐఎండీ ప్రకారం.. తూర్పు, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఉరుములతో కూడిన వానలు పడతాయి. ఈ నెల 30 వరకు అసోం, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​లో అతి భారీ వర్షాలు పడతాయి.
(4 / 6)
ఐఎండీ ప్రకారం.. తూర్పు, ఈశాన్య భారతంలోని అనేక ప్రాంతాల్లో 5 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం ఉరుములతో కూడిన వానలు పడతాయి. ఈ నెల 30 వరకు అసోం, మేఘాలయ, అరుణాచల్​ప్రదేశ్​లో అతి భారీ వర్షాలు పడతాయి.(PTI)
హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
(5 / 6)
హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.(PTI)
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి మండీ జిల్లాలోని మనాలీ- చంఢీగఢ్​ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన అధికారులు.. రహదారిని పునరుద్ధరించారు. అప్పటివరకు వందలాది మంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.
(6 / 6)
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం రాత్రి మండీ జిల్లాలోని మనాలీ- చంఢీగఢ్​ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 20 గంటల పాటు శ్రమించిన అధికారులు.. రహదారిని పునరుద్ధరించారు. అప్పటివరకు వందలాది మంది పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.(HT Photo/Ravi Kumar)

    ఆర్టికల్ షేర్ చేయండి