తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Ts Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీకి భారీ వర్ష సూచన, రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీకి భారీ వర్ష సూచన, రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

05 May 2024, 11:35 IST

AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. తాజా అప్డేట్స్ ను ఇక్కడ చూడండి……

  • AP Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. తాజా అప్డేట్స్ ను ఇక్కడ చూడండి……
 భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.
(1 / 8)
 భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.()photo source from https://unsplash.com/)
శనివారం(మే 4) ప్రకాశం(Prakasam) జిల్లా దరిమడుగు(Darimadugu)లో 47. డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైయస్సార్ జిల్లా కలసపాడులో 46.4°C, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.1°C, కర్నూలు(Kurnool) జిల్లా వగరూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
(2 / 8)
శనివారం(మే 4) ప్రకాశం(Prakasam) జిల్లా దరిమడుగు(Darimadugu)లో 47. డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైయస్సార్ జిల్లా కలసపాడులో 46.4°C, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2°C, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.1°C, కర్నూలు(Kurnool) జిల్లా వగరూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.(Photo Source @APSDMA Twitter)
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట లు కొనసాగుతున్నాయి.
(3 / 8)
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట లు కొనసాగుతున్నాయి.(Photo Source @APSDMA Twitter)
ఇవాళ(మే 5) శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో 4 మండలాలు, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 13, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 
(4 / 8)
ఇవాళ(మే 5) శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో 4 మండలాలు, విజయనగరం 12, పార్వతీపురంమన్యం 13, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. (photo source from https://unsplash.com)
ఇదిలా ఉంటే ఏపీకి ఐఎండీ చల్లని కబురు చెప్పింది. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
(5 / 8)
ఇదిలా ఉంటే ఏపీకి ఐఎండీ చల్లని కబురు చెప్పింది. దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. (photo source from https://unsplash.com)
ద్రోణి ప్రభావంతో మే 7న ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని  ఐఎండీ(అమరావతి) పేర్కొంది. 
(6 / 8)
ద్రోణి ప్రభావంతో మే 7న ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని  ఐఎండీ(అమరావతి) పేర్కొంది. (photo source from https://unsplash.comphoto source from https://unsplash.com)
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో మే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(7 / 8)
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో మే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.(photo source from https://unsplash.com)
ఇక గత రెండు మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలే కాకుండా… ఉక్కపోత కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. 
(8 / 8)
ఇక గత రెండు మూడు రోజులుగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలే కాకుండా… ఉక్కపోత కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. (photo source from https://unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి