తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bharat Jodo Yatra: శ్రీనగర్ లాల్ చౌక్‍లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. భారీ కటౌట్, పటిష్ఠ భద్రత: ఫొటోలు

Bharat Jodo Yatra: శ్రీనగర్ లాల్ చౌక్‍లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. భారీ కటౌట్, పటిష్ఠ భద్రత: ఫొటోలు

29 January 2023, 17:45 IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో ఆదివారం (జనవరి 29).. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటోలతో పాటు వివరాలివే..

  • Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకుంది. ఈ తరుణంలో ఆదివారం (జనవరి 29).. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటోలతో పాటు వివరాలివే..
భారత్ జోడో యాత్ర తుది దశలో భాగంగా ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ప్రధాని పర్యటన సమయంలో చేపట్టే లాంటి పటిష్ఠ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రేపటి (జనవరి 30)తో భారత్ జోడో యాత్ర ముగియనుంది. 
(1 / 8)
భారత్ జోడో యాత్ర తుది దశలో భాగంగా ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ప్రధాని పర్యటన సమయంలో చేపట్టే లాంటి పటిష్ఠ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రేపటి (జనవరి 30)తో భారత్ జోడో యాత్ర ముగియనుంది. (AFP)
జమ్ము కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (JKPCC)కి ముందుగా చేరుకొని.. అక్కడి నుంచి లాల్ చౌక్‍కు వచ్చారు రాహుల్. 
(2 / 8)
జమ్ము కశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (JKPCC)కి ముందుగా చేరుకొని.. అక్కడి నుంచి లాల్ చౌక్‍కు వచ్చారు రాహుల్. (PTI)
జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నామని, కానీ ముందుగా నిర్వహించాల్సి వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్‍చార్జ్ జైరామ్ రమేశ్.. ట్విట్టర్ ద్వారా తెలిపారు.
(3 / 8)
జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేసుకున్నామని, కానీ ముందుగా నిర్వహించాల్సి వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, కమ్యూనికేషన్స్ ఇన్‍చార్జ్ జైరామ్ రమేశ్.. ట్విట్టర్ ద్వారా తెలిపారు.(ANI)
“జనవరి 30వ తేదీన పీసీసీ ఆఫ్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించాల్సింది. అయితే అనుమతలి దక్కలేదు. అయితే లాక్ చౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించుకునేందుకు రాష్ట్ర అధికారులు అనుమతిని ఇచ్చారు. అందుకే ఈ రోజు నిర్వహించాం” అని రమేశ్ ట్వీట్ చేశారు.
(4 / 8)
“జనవరి 30వ తేదీన పీసీసీ ఆఫ్ వద్ద జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించాల్సింది. అయితే అనుమతలి దక్కలేదు. అయితే లాక్ చౌక్ వద్ద కార్యక్రమం నిర్వహించుకునేందుకు రాష్ట్ర అధికారులు అనుమతిని ఇచ్చారు. అందుకే ఈ రోజు నిర్వహించాం” అని రమేశ్ ట్వీట్ చేశారు.(ANI)
లాల్ చౌక్ వద్ద కిలో మీటర్ పరిధి వరకు శనివారం రాత్రి నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. 
(5 / 8)
లాల్ చౌక్ వద్ద కిలో మీటర్ పరిధి వరకు శనివారం రాత్రి నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. (ANI)
అన్ని రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు భద్రతా సిబ్బంది. 
(6 / 8)
అన్ని రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు భద్రతా సిబ్బంది. (ANI)
జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా అన్ని దుకాణాలు, వ్యాపారాలు, వారాంతపు మార్కెట్‍ను కూడా మూయించారు.
(7 / 8)
జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా అన్ని దుకాణాలు, వ్యాపారాలు, వారాంతపు మార్కెట్‍ను కూడా మూయించారు.(ANI)
భద్రతలో లోపాలు ఉన్నాయన్న కారణంగా జనవరి 27న అనంతనాగ్ జిల్లాలో భారత్ జోడో యాత్ర నిలిచిపోయింది.
(8 / 8)
భద్రతలో లోపాలు ఉన్నాయన్న కారణంగా జనవరి 27న అనంతనాగ్ జిల్లాలో భారత్ జోడో యాత్ర నిలిచిపోయింది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి