తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xiaomi Diwali Sale: షియోమీ దివాళీ సేల్.. మొబైల్స్‌పై రూ. 8 వేల వరకు తగ్గింపు

Xiaomi Diwali sale: షియోమీ దివాళీ సేల్.. మొబైల్స్‌పై రూ. 8 వేల వరకు తగ్గింపు

HT Telugu Desk HT Telugu

19 September 2022, 12:22 IST

    • Xiaomi Diwali sale: షియోమీ దివాళీ విత్ ఎంఐ పేరుతో పండగ సేల్ ప్రకటించింది. సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో మొబైల్స్‌పై రూ. 8 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
Xiaomi Diwali sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలపై షియోమీ భారీ డిస్కౌంట్లు
Xiaomi Diwali sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలపై షియోమీ భారీ డిస్కౌంట్లు

Xiaomi Diwali sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలపై షియోమీ భారీ డిస్కౌంట్లు

Xiaomi Diwali sale: షియోమీ దీపావళి సేల్ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు Redmi 10 Prime, Redmi Note 11, Redmi Note 11 Pro, Redmi Note 11 Pro+ 5G తదితర Xiaomi ఫోన్‌ల కొనుగోలుపై రూ. 8,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు కొనుగోలుదారులకు డిస్కౌంట్స్ అందించడానికి ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ వంటి ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. పండగ సేల్‌కు ముందు కంపెనీ రెడ్‌మి మొబైల్స్, టీవీలు, ఇతర గాడ్జెట్లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది.

రెడ్‌మి 9 యాక్టివ్ ఈ తాజా సేల్‌లో డిస్కౌంట్‌పై రూ. 7,499కి లభిస్తుంది. దీని అసలు ధర రూ. 12,999. అదేవిధంగా రెడ్‌మీ 10 ప్రైమ్ ధర రూ. 14,999 నుంచి రూ.9,449కి తగ్గనుంది. ఇక ఈ ఫోన్ 2022 మోడల్ అసలు ధరపై రూ. 7,550 తగ్గింపుతో వస్తోంది.

Redmi Note 11 స్మార్ట్‌ఫోన్‌ను ఈ దీపావళి Mi సేల్‌లో రూ. 10,799కి కొనుగోలు చేయవచ్చు. Redmi Note 11T 5G రూ. 13,749 ధరతో లభిస్తుంది. సరసమైన Redmi 9i స్పోర్ట్ ఈ సేల్‌లో మరింత తక్కువ ధరకు.. అంటే రూ. 6,999లకే లభిస్తుంది. Redmi Note 11SE రూ. 11,249 రూపాయల తగ్గింపు ధరతో లభిస్తుంది.

రెడ్‌మి 11 ప్రైమ్ 5 జి రూ. 11,749కి లభిస్తుండగా, రెడ్‌మి నోట్ 11 ప్రో+ 5 జి రూ. 16,999కి కొనుగోలు చేయవచ్చు. Xiaomi 11T Pro 5G, Xiaomi 11 Lite NE 5G వరుసగా రూ. 28,499, రూ. 18,499కి అందుబాటులో ఉంటాయి. Xiaomi 11i, Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G ఈ ఎంఐ దివాళీ సేల్‌లో రూ. 18,999, రూ. 19,999కి అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ టీవీ విభాగంలో, Mi TV QLED 4K రూ. 46,999కి లభ్యమవుతుంది. Xiaomi OLED Vision TV55ని తాజా సేల్‌లో రూ. 86,999లకే కొనుగోలు చేయవచ్చు. Xiaomi Pad 5 రూ. 22,999కి అందుబాటులో ఉంటుంది.