తెలుగు న్యూస్  /  National International  /  Uddhav Vs Shinde: Ec Freezes Shiv Sena's "Bow And Arrow" Symbol Ahead Of Bypoll

Uddhav vs Shinde: ఇరు ‘సేన’లకూ నిరాశే..!

HT Telugu Desk HT Telugu

08 October 2022, 22:37 IST

  • Uddhav vs Shinde: మహారాష్ట్రలోని శివసేనలో నెలకొన్న సంక్షోభం పర్యవసానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలైన శివసేన ఎవరిదనే విషయం నుంచి, పార్టీ జెండా, పార్టీ గుర్తు ఎవరికి చెందుతాయనే విషయం వరకు ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 

ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే
ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే

ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే

Uddhav vs Shinde: మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలి, ఏక్ నాథ్ షిండే వర్గం బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. నాటి నుంచి, అసలైన శివసేన తమదేనని షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తూనే ఉన్నాయి. ఈ వివాదం ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Uddhav vs Shinde: రెండింటికీ ఇవ్వం..

తాజాగా, శివసేన పార్టీ గుర్తు అయిన విల్లంబులు(bow and arrow)ను ప్రస్తుతానికి ఎవరికీ కేటాయించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ గుర్తును తమకే కేటాయించాలని షిండే, ఠాక్రే వర్గాలు ఈసీని ఆశ్రయించాయి. దాంతో, ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

Uddhav vs Shinde: వేరే గుర్తు ఇస్తాం..

ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్ నాథ్ షిండే వర్గం కోరుకుంటే, వారికి ఫ్రీ సింబల్స్ నుంచి వేర్వేరు గుర్తులు కేటాయిస్తామని ఈసీ తెలిపింది. తాము నిర్ణయం వెలువరించే వరకు ఈ వర్గం కూడా శివసేన పేరును కానీ, గుర్తును కానీ వాడకూడదని ఆదేశించింది. రెండు వర్గాలు కూడా తాము కోరుకుంటున్న 3 గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో అక్టోబర్ 10 లోగా ఈసీకి తెలియజేయాలని, వాటిలో ఒక్కో గుర్తును కేటాయిస్తామని వివరించింది. శివసేన ఓనర్ షిప్ విషయమై తుది నిర్ణయం తీసుకునేవరకు ఈ ఆదేశాలు చెల్లబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.