తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. సెన్సెక్స్​ 100ప్లస్​

Stock market today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. సెన్సెక్స్​ 100ప్లస్​

Sharath Chitturi HT Telugu

23 June 2022, 9:22 IST

    • Stock market today : దేశీయ సూచీలు గురువారం ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి.
స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

స్టాక్​ మార్కెట్​ ఇండియా

Stock market today : దేశీయ సూచీలు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 108పాయింట్ల లాభంతో 51,931 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 13 పాయింట్లు వృద్ధి చెంది 15,427 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

ఇండియా స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలనే చూశాయి. 700పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​.. 51,823 వద్ద స్థిరపడింది. 225 పాయింట్ల పతనంతో 15,413 వద్ద ముగిసింది నిఫ్టీ. కాగా గురువారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీ వరుసగా.. 51,927- 15,452 వద్ద మొదలుపెట్టాయి.

ఎప్పటిలాగే.. మార్కెట్లను ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి.

లాభాలు.. నష్టాలు..

ఎయిర్​టెల్​, విప్రో, అల్ట్రాటెక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, పవర్​గ్రిడ్​, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

అమెరికా మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లోనే స్థిరపడ్డాయి. తొలుత లాభాల్లో ఉన్నప్పటికీ.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. డౌ జోన్స్​ 0.15శాతం నష్టపోయింది. నాస్​డాక్​ 0.15శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.13శాతం మేర నష్టపోయాయి.

ఆసియా సూచీలు మాత్రం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.69శాతం లాభాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పి 0.64శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.48శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

చమురు ధరలు..

అంతర్జాతీయంగా చమురు ధరలు 2శాతం పడ్డాయి. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్​ ధర 103.80డాలర్లుగా ఉంది.

ఎఫ్​ఐఐ.. డీఐఐ..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 2,920.61కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. కాగా.. అదే సమయంలో రూ. 1,859కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

టాపిక్