తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sabarimala News Today : ‘శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందులు- వెంటనే పరిష్కరించండి’

Sabarimala news today : ‘శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందులు- వెంటనే పరిష్కరించండి’

Sharath Chitturi HT Telugu

17 December 2023, 11:22 IST

  • Sabarimala news today : శబరిమలలో అయ్యప్ప భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని కేరళ సీఎంకు లేఖ రాశారు కిషన్​ రెడ్డి.

శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందు- వెంటనే పరిష్కరించండి’
శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందు- వెంటనే పరిష్కరించండి’ (PTI)

శబరిమల భక్తులకు తీవ్ర ఇబ్బందు- వెంటనే పరిష్కరించండి’

Sabarimala news today : అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళుతున్న భక్తుల సౌకర్యాలను పెంచాలని కోరుతూ.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కి లేఖ రాశారు కేంద్రమంత్రి జీ కిషన్​ రెడ్డి. భక్తులకు త్వరగా దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ఆలయంలో సిబ్బంది సంఖ్యను పెంచాలని విజ్ఞాప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

ఆహారం, నీరు, వైద్య సదుపాయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పినరయి విజయన్​ని అభ్యర్థించారు కిషన్​ రెడ్డి.

"శబరిమల ఆలయంలో, ఆలయానికి వెళుతున్న మార్గంలో ఆయప్ప భక్తులు ఇబ్బందికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భక్తుల కనీస సౌకర్యాలను మెరుగుపరచాలి," అని కేరళ సీఎంకు లేఖ్​ రాశారు కేంద్రమంత్రి.

Sabarimala darshan latest news : "శబరిమల ఆలయంతో పాటు భక్తుల 40 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతియేటా కోటికి పైగా మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ నుంచే 15లక్షల మంది భక్తులు ఉంటారు. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి చాలా సమయం పడుతోందని నా దృష్టికి వచ్చింది. దర్శనానికి వెళుతున్న.. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయిందన్న వార్త నన్ను కదిలించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధంగా చర్యలు తీసుకోండి. ఎన్​జీఓల సాయం తీసుకునే ఆప్షన్​ని పరిశీలించండి," అని లేఖలో పేర్కొన్నారు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి.

ఇదీ చూడండి:- శబరిమలకి 18 సంఖ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

శబరిమల ఆలయం వద్ద సౌకర్యాలు సరిగ్గా ఉండట్లేదని నివేదికలు వస్తున్నాయి. ఇదే విషయంపై.. హిందూ ఐక్య వేది అనే సంస్థ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవలే నిరసన చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్​లు కూడా విజయన్​ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెబుతోంది.

శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

Sabarimala special trains from Hyderabad : శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. డిసెంబర్, జనవరి నెలల్లో 22 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.

కింద్రాబాద్‌-కొల్లం, సికింద్రాబాద్‌-కొట్టాయం, కాకినాడ-కొట్టాయంల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. నాలుగు రైళ్లు డిసెంబరు 27-30 తేదీల మధ్య.. 18 రైళ్లు జనవరి 3-15 మధ్య రాకపోకలు సాగించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం