తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహం.. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతికి ఘన నివాళి!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహం.. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతికి ఘన నివాళి!

24 January 2022, 11:01 IST

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ హోలోగ్రామ్‌లోని నేతాజీ రూపం 30 వేల ల్యూమెన్స్ 4కె ప్రొజెక్టర్‌తో పనిచేస్తుంది. సుభాష్ చంద్రబోస్ పోరాటానికి గుర్తుగా త్వరలో ఇండియా గేట్ వద్ద గ్రానైట్‌తో చేసిన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ లోపు అక్కడ ఈ హోలోగ్రామ్ విగ్రహంను కొనసాగించనున్నారు.