తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Syllabus 2024 25 : సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​- ఇక నుంచి కొత్త సిలబస్​!

CBSE syllabus 2024 25 : సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​- ఇక నుంచి కొత్త సిలబస్​!

Sharath Chitturi HT Telugu

24 March 2024, 12:40 IST

    • CBSE new syllabus 2024 25 : సీబీఎస్​ఈ క్లాస్​ 3- క్లాస్​ 6 విద్యార్థుల సిలబస్​ మారనుంది! ఈ మేరకు సీబీఎస్​ఈ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎన్​సీఈఆర్​టీ కొత్త సిలబస్​..
ఎన్​సీఈఆర్​టీ కొత్త సిలబస్​..

ఎన్​సీఈఆర్​టీ కొత్త సిలబస్​..

CBSE syllabus 2024 25 : సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్​! పలు తరగతుల సిలబస్​ని మార్చాలని నిర్ణయించింది ఎన్​సీఈఆర్​టీ (నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఎడ్జ్యుకేషన్​ రీసెర్చ్​). ఈ మేరకు.. 2024-25 విద్యా సంవత్సరంలో 3 నుంచి 6వ తరగతి వరకు సిలబస్, టెక్ట్స్​బుక్స్​ని ఛేంజ్​ చేస్తుంది. ఇతర తరగతుల కరికులమ్​లో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విషయాన్ని.. సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​) స్పష్టం చేసింది.

"క్లాస్​ 3 నుంచి క్లాస్​ 6 వరకు సిలబస్​, టెస్ట్​బుక్స్​ని మారుస్తున్నట్టు.. మార్చ్​ 18న ఎన్​సీఈఆర్​టీ మాకు చెప్పింది. ఈ విషయాన్ని అన్ని సీబీఎస్​ఈ అనుబంధ సంస్థలకు మేము స్పష్టం చేస్తున్నాము. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము. ఈ కొత్త సిలబస్​, టెక్ట్స్​బుక్స్​నే ఫాలో అవ్వాలని విద్యాసంస్థలకు సూచనలు చేస్తున్నాము," అని సీబీఎస్​ఈ వెల్లడించింది.

CBSE syllabus class 3 to class 6 : ఎన్​సీఎఫ్​-ఎస్​ఈ 2023 (నేషనల్​ కరికూలమ్​ ఫ్రేమ్​వర్క్​ ఫర్​ స్కూల్​ ఎడ్జ్యుకేషన్​)లో భాగంగా.. ఈ చర్యలు చేపట్టింది ఎన్​సీఈఆర్​టీ. 2020 నేషనల్​ ఎడ్జ్యుకేషన్​ పాలసీని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తోంది. అయితే.. అన్ని తరగతు సిలబస్​ని మార్చే ఉద్దేశంలో ఎన్​సీఈఆర్​టీ లేదని ముందు నుంచే వార్తలు జోరుగా సాగాయి. అందుకు తగ్గట్టుగానే.. కేవలం 3 నుంచి 6 తరగతుల వరకు సిలబస్​, టెక్ట్స్​బుక్స్​ని మార్చింది. మిగిలిన తరగతులు విద్యార్థులు.. ఇప్పుడున్న సిలబస్​తోనే కంటిన్యూ అవుతారు.

ఎన్​ఈపీ-2020లో భాగంగా.. స్కూల్​ హెడ్స్​- టీచర్స్​కి 'కెపాసిటీ బిల్డింగ్​ ప్రోగ్రామ్స్​'ని ఇవ్వాలని నిర్ణయించుకుంది సీబీఎస్​ఈ. ఆర్ట్​- ఇంటిగ్రేటెడ్​ ఎడ్జ్యుకేషన్​, ఎక్స్​పరిమెంటల్​ లర్నింగ్​, ఫ్లెక్సిబులిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, సంబంధిత అంశాలను స్కూళ్లల్లో అమలు చేయాలని విద్యాసంస్థలకు సూచించింది.

CBSE syllabus change : 2020లో క్లాస్​ 6 నుంచి క్లాస్​ 12 వరకు సిలబస్​ని హేతుబద్ధీకరించింది ఎన్​సీఈఆర్​టీ. కొవిడ్​ సంక్షోభం అనంతరం.. విద్యార్థులపై కంటెంట్​ లోడ్​ని, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ముఘల్​ కోర్ట్​లు, గుజరాత్​ అల్లర్లు, కోల్డ్​ వార్​, ముఘల్​ చరిత్ర, ఎమర్జెన్సీ, పీరియాడిక్​ టేబుల్​కు చెందిన ఛాప్టర్స్​ని తొలగించింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. చరిత్రనే చెరిపేస్తున్నారని అనేకమంది మండిపడ్డారు.

తదుపరి వ్యాసం