తెలుగు న్యూస్  /  National International  /  Mukesh Ambani Resigns From Jio, Son Akash Made Chairman

రిలయన్స్ జియో పగ్గాలు ఆకాశ్ అంబానీకి.. రాజీనామా చేసిన ముకేశ్ అంబానీ

HT Telugu Desk HT Telugu

28 June 2022, 17:21 IST

    • రిలయన్స్ జియో పగ్గాలను కొడుకు ఆకాశ్ అంబానీకి అప్పగించి ముకేశ్ అంబానీ రాజీనామా చేశారు.
పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో) (PTI)

పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీతో ముకేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

న్యూఢిల్లీ, జూన్ 28: ముకేశ్ అంబానీ తన గ్రూప్ టెలికాం విభాగం రిలయన్స్ జియో బోర్డుకు రాజీనామా చేశారు. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి కంపెనీ పగ్గాలను అప్పగించారు. ఇది 65 ఏళ్ల బిలియనీర్ వారసత్వ ప్రణాళికగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

‘కంపెనీ బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్‌గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ నియామకాన్ని జూన్ 27న జరిగిన సమావేశంలో కంపెనీ బోర్డు ఆమోదించింది..’ అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది.

ముకేశ్ అంబానీ రాజీనామా జూన్ 27 సాయంత్రం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తాజా నియామకం అమల్లోకి వస్తుంది.

కాగా ఐదు సంవత్సరాల పాటు కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు. రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరిలను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించారు.