తెలుగు న్యూస్  /  National International  /  Mandaviya Reviews Covid Situation; Mask Mandate Should Continue

New variants of Corona Omicron: కరోనా కొత్త సబ్ వేరియంట్స్ తో ముప్పు

HT Telugu Desk HT Telugu

18 October 2022, 23:04 IST

  • New variants of Corona Omicron: కరోనా వైరస్ ముప్పు ముగిసిందని భావిస్తున్న ప్రతీ సందర్భంలో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొస్తోంది. తాజాగా వెలుగు చూసిన సబ్ వేరియంట్ XBB పై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New variants of Corona Omicron: దేశంలో కోవిడ్ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సమీక్షించారు. కొత్త సబ్ వేరియంట్లను దేశంలో గుర్తించడంతో, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

New variants of Corona Omicron: XBB వేరియంట్

ఈ సబ్ వేరియంట్ ను మొదట సింగపూర్ లో ఈ ఆగస్ట్ నెలలో గుర్తించారు. అక్కడ ఈ సబ్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ BA.2.75, BJ.1 సబ్ వేరియంట్ల హైబ్రిడ్ గా గుర్తించారు. భారత్ లో ఈ వేరియంట్ ను మహారాష్ట్ర, కేరళల్లో గుర్తించారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని, అలాగే, వ్యక్తి రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది.

New variants of Corona Omicron: మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో ఈ వేరియంట్ ను మొదట గుర్తించారు. గత వారం రోజుల్లో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17.7% పెరిగాయి. రానున్న పండుగ సీజన్ లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఒమిక్రాన్ BA.2.3.20 and BQ.1 వేరియంట్లను కూడా గుర్తించారు.

New variants of Corona Omicron: మాస్క్ లు మస్ట్

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులు కచ్చితంగా ధరించేలా చూడాలని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. సంబంధిత నిబంధనలను అన్ని రాష్ట్రాలకు పంపనున్నారు. కొత్త వేరియంట్ల కారణంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయంపై వారు చర్చించారు. వివిధదేశాల నుంచి వచ్చే ఎంట్రీ పాయింట్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.