Karnataka election results : స్పష్టంగా కాంగ్రెస్ హవా.. బీజేపీకి ఓటమి ఖాయం!
13 May 2023, 12:04 IST
- Karnataka election results : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళుతోంది. బీజేపీ వెనకపడింది. మరి ఇప్పుడు బీజేపీ అధికారాన్ని కోల్పోనుందా?
ఓ ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు..
Karnataka election results : కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది! శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార బీజేపీ కన్నా అత్యధిక సీట్లల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ, జేడీఎస్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది.
బీజేపీకి ఓటమి తప్పదా..?
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. 2,615 మంది ఎన్నికల్లో పోటీ పడ్డారు. కాగా.. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. కాంగ్రెస్ 120 సీట్లల్లో లీడ్లో ఉంది. బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ కేవలం 27 సీట్లలో ముందజంలో ఉంది. స్వతంత్రులు 7 సీట్లలో లీడ్ను కొనసాగుతున్నారు.
ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం ఉదయం 11:30 గంటల వరకు కాంగ్రెస్కు 42.93 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 36.17 శాతం ఓట్లు లభించాయి. జేడీఎస్కు 12.97 శాతం ఓట్లు లభించాయి.
Karnataka election results 2023 : కర్ణాటకలో మేజిక్ ఫిగర్ 113 అన్న విషయం తెలిసిందే. ఈ నెంబర్ దాటిన పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. మేజిక్ ఫిగర్కు దగ్గర్లో ఉన్న పార్టీలు.. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకునే పనిలో పడొచ్చు!
కాంగ్రెస్లో సంబరాలు..
తాజా పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ బృందంలో వేడుకలు మొదలయ్యాయి! పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తుందని సభ్యులు సంతోషపడుతున్నారు. పార్టీ అధిష్ఠానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్త సందడి నానాటికి పెరుగుతోంది. ఆనందంతో వారందరు డ్యాన్స్లు చేస్తున్నారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Karnataka election results live updates : కర్ణాటక ఎన్నికల ఫలితాల పరిణామాలతో దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నేతలు వేడుకలు చేసుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేతలు ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. హుబ్బళ్లీలోని హనుమాన్ గుడిలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై.
గత ఎన్నికల్లో..
Karnataka congress latest news : 2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య.. కాంగ్రెస్- జేడీఎస్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కొంతకాలం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చివరికి మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది.