తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఐటీ శాఖ నుంచి అపాయింట్​మెంట్​ లెటర్​ వచ్చిందా? తస్మాత్​ జాగ్రత్త!

ఐటీ శాఖ నుంచి అపాయింట్​మెంట్​ లెటర్​ వచ్చిందా? తస్మాత్​ జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

22 February 2022, 15:52 IST

    • మీకు ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగం వచ్చిందని అపాయింట్​మెంట్​ లెటర్​ వచ్చిందా? మీ నుంచి ఎవరైనా డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారా? అయితే తస్మాత్​ జాగ్రత్త. ఇదే విషయంపై ఐటీశాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది.
ఐటీశాఖ
ఐటీశాఖ (Google)

ఐటీశాఖ

government jobs fake website | సామాజిక మాధ్యమాలను దుర్వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఫేక్​ న్యూస్​ అనేది ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా.. ఇందుకు సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కొందరికి అపాయింట్​మెంట్​ లెటర్లు అందుతున్నాయి. వాటిని నిజమని నమ్మి వారు మోసపోతున్నారు. ఇలా ఫేక్​ అపాయింట్​మెంట్​ లెటర్లు తయారు చేసిన వారు, డేటా, డబ్బులు తీసుకుని పారిపోతున్నారు. ఇలా చాలా మంది ఇప్పటికే మోసపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో ఈ మధ్యకాలంలో ఫేక్​ అపాయింట్​మెంట్​లు పెరిగిపోయాయి. తాజాగా.. దీనిపై ఐటీశాఖ స్పందించింది. ఇలాంటి వాటికి లోంగిపోయి, మోసపోకండని హెచ్చరించింది.

"ఫేక్​ అపాయింట్​మెంట్​ లెటర్లు జారీ చేసి ఐటీశాఖలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను కొందరు మోసం చేస్తున్నారు. ఈ విషయం ఐటీశాఖ దృష్టికి వచ్చింది. గ్రూప్​ బీ/ గ్రూప్​ సీ పోస్టుల భర్తీకి.. ఎస్​ఎస్​సీ పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వివరాలు https://ssc.nic.in లో పొందవచ్చు. ఆ తర్వాత ప్రాంతీయంగా భర్తీలు చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసి, వాటిని https:/ / incometaxindia.gov.in వెబ్​సైట్​లో పెడతారు. ఇది ప్రజలు గమనించాలి. ఫేక్​ యాడ్​లు, నోటిఫికేషన్లు, అపాయింట్​మెంట్​ లెటర్లును నమ్మకండి. ఎస్​ఎస్​సీ, ఐటీశాఖకు సంబంధించిన అధికారిక వెబ్​సైట్​లోనే వివరాలు తెలుసుకోండి," అని ట్విట్టర్​ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది ఐటీశాఖ.

తదుపరి వ్యాసం