తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Terrorist Attack : జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి!

Terrorist attack : జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి!

Sharath Chitturi HT Telugu

22 December 2023, 6:00 IST

  • Jammu Kashmir terrorist attack : జమ్ముకశ్మీర్​ రాజౌరీలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మరణించిన జవాన్ల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం ఆ ప్రాంతం.. ఆర్మీ ఆధీనంలో ఉంది. 

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి!
జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి! (PTI)

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి!

Jammu Kashmir terrorist attack : జమ్ముకశ్మీర్​లో గురువారం ఉగ్రదాడి జరిగింది. భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరగ్గా.. నలుగురు జవాన్లు మరణించారు.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

ఆకస్మిక దాడి..

జమ్ముకశ్మీర్​ రాజౌరీ ప్రాంతంలోని డేరా కి గాలి అనే ప్రాంతం నుంచి సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. గురువారం మధ్యాహ్నం 3: 45 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది! ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న సైనికులు ప్రతిఘటించారు. ఫలితంగా గన్​ ఫైట్​ మొదలైంది. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందినట్టు ఇండియన్​ ఆర్మీ వెల్లడించింది.

Rajouri attack news today : చివరి సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి వరకు ఇరువర్గాల మధ్య ఎన్​కౌంటర్​ కొనసాగుతోంది. మరోవైపు.. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి.

"ఆ ప్రాంతంలో బుధవారం సాయంత్రం నుంచే మేము ఆపరేషన్​లో ఉన్నాము. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్​ చేపట్టాము. గురువారం.. ముష్కరులతో కాంటాక్ట్​ అయ్యింది. ఎన్​కౌంటర్​ సంభవించింది," అని ఆర్మీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

గత నెలలో..!

Rajouri attack martyrs : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల కార్యకలాపాలు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది! గత నెలలో.. రాజౌరీలోని కలకోట్​ ప్రాంతంలో ఆర్మీ చేపట్టిన యాంటీ టెరర్ర్​ ఆపరేషన్​లో ఇద్దరు కెప్టెన్​లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు విడిచారు.

రాజౌరీలో గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నట్టు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు భారీ ఎత్తున చర్యలు చేపడుతున్నాయి.

Jammu Kashmir terror attack death toll : ఈ ఏడాది ఏప్రిల్​- మేలో రాజౌరీ- పూంచ్​ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10మంది సైనికులు మరణించారు. వాస్తవానికి ఇక్కడ 2003-2021 వరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత ముష్కరులు మళ్లీ యాక్టివ్​ అయ్యారు!

మొత్తం మీద గత రెండేళ్లల్లో జరిగిన యాంటీ- టెర్రర్​ ఆపరేషన్స్​లో 35కుపైగా మంది సైనికులు ప్రాణాలు విడిచారు.

తదుపరి వ్యాసం