తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dalit Rape Victim Set On Fire: దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై సజీవ దహనం

Dalit rape victim set on fire: దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై సజీవ దహనం

HT Telugu Desk HT Telugu

20 September 2022, 9:54 IST

  • Dalit rape victim set on fire: ఓ దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసి సజీవ దహనం చేశారు.

యూపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేశారు
యూపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేశారు (HT_PRINT)

యూపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేశారు

పిలిభిత్ (యుపి), సెప్టెంబరు 19: ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ ప్రాంతంలోని మధోతండా లో ఇద్దరు వ్యక్తులు ఓ దళిత బాలికపై అత్యాచారం జరిపి సజీవ దహనం చేసిన ఘాతుకంలో ఆ అమ్మాయి మృతి చెందింది. 12 రోజులుగా లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి వెళ్లిపోయారని తెలిపారు.

ముందుజాగ్రత్త చర్యగా గ్రామంలో తగినంత పోలీసు బలగాలను మోహరించారు. సెప్టెంబరు 7న మధోతండా ప్రాంతంలోని ఓ గ్రామంలో రాజ్‌వీర్‌, తారాచంద్‌ అనే ఇద్దరు వ్యక్తులు 16 ఏళ్ల దళిత బాలిక ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డారని అధికారి తెలిపారు.

నిందితులు బాలికపై నూనె పోసి తగులబెట్టారు. రెండు గంటల్లోనే నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారని ప్రభు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పుడు హత్యా నేరం మోపుతామని, ఇద్దరు నిందితులను గ్యాంగ్‌స్టర్ చట్టం కింద విచారిస్తామని పోలీసులు తెలిపారు.