తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Earthquake Today : చైనాలో భారీ భూకంపం.. 21మంది బలి!

China earthquake today : చైనాలో భారీ భూకంపం.. 21మంది బలి!

Sharath Chitturi HT Telugu

05 September 2022, 17:14 IST

  • China earthquake today : చైనాలో భారీ భూకంపానికి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

చైనాలో భారీ భూకంపం తర్వాత పరిస్థితి ఇలా..
చైనాలో భారీ భూకంపం తర్వాత పరిస్థితి ఇలా.. (AP)

చైనాలో భారీ భూకంపం తర్వాత పరిస్థితి ఇలా..

China earthquake today : చైనాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం.. చైనాలోని నైరుతి ప్రాంతాన్ని గడగడలాడించింది. ముఖ్యంగా సిచువాన్ రాష్ట్రంలోని లుడింగ్​ కౌంటీ.. భూకంపం ధాటికి వణికిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

సిచువాన్​ రాష్ట్రం విలవిల..

స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:25 గంటలకు చైనాలో భూకంపం సంభవించింది. భూమికి 16 కిలోమీటర్ల లోతును ప్రకంపనలు చోటుచసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.

చైనాలో భారీ భూకంపానికి 21మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటం ఆందోళనకరం. కొవిడ్​ కేసులతో ఇప్పటికే విలవిలలాడుతున్న లుడింగ్​ కౌంటీ ప్రజలపై ఈ భూకంపం.. మరో పిడుగులా వచ్చి పడింది.

China earthquake news : లుడింగ్​ కౌంటీకి 39 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. కాగా.. అక్కడి నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్​ రాజధాని చెంగ్డులోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. చైనాలో భారీ భూకంపానికి చెంగ్డు ప్రాంతంలోని ఎత్తైన భవనాలు కదిలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

టిబిట్​కి సమీపంలో ఉంటుంది సిచువాన్​ రాష్ట్రం. టిబెటిన్​ ప్లాట్యూలో అధికంగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి.

2008లో సిచువాన్​ రాష్ట్రంలో సంభవించిన 8.2 తీవ్రత భూకంపానికి 69వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో ఇదే ప్రాంతంలో.. 7 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 200మంది మరణించారు. ఆ చీకటి రోజులను ఈ ప్రాంతం ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

China earthquake death toll : సిచువాన్​ రాష్ట్రాని ఈ మధ్యకాలంలో ఏదీ కలిసి రావడం లేదు. ఆ రాష్ట్రంలో కొవిడ్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అనేకమార్లు అక్కడ లాక్​డౌన్​ అమల్లోకి వస్తోంది. మరోవైపు కరవు పరిస్థితులు కూడా తీవ్రంగా ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ వర్షాలు పడి చాలా కాలమైంది. ఇక ఇప్పుడు చైనాలో భారీ భూకంపం.. ఆ ప్రాంతాన్ని వణికించింది.

తదుపరి వ్యాసం