Earthquake in Jammu Kashmir : జమ్ముకశ్మీర్లో భూకంపం.. 3 రోజుల్లో 7వసారి!
26 August 2022, 6:42 IST
- Earthquake in Jammu Kashmir today : జమ్ముకశ్మీర్లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఆ ప్రాంతంలో భూమి కంపించడం.. గత మూడు రోజుల్లో ఇది 7వ సారి.
జమ్ముకశ్మీర్లో భూకంపం.. మూడు రోజుల్లో 7వ సారి..!
Earthquake in Jammu Kashmir today : జమ్ముకశ్మీర్లో భూకంపం పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. తాజాగా.. మరోమారు భూకంపం సంభవించింది. ఫలితంగా.. జమ్ముకశ్మీర్లో గత మూడు రోజుల్లో 7సార్లు భూమి కంపించింది.
తాజాగా.. జమ్ముకశ్మీర్లోని కాట్రా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.4గా నమోదైంది. ఈ వివరాలను ఎన్సీఎస్(నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ) వెల్లడించింది.
భూమికి 5కిమీల దిగువన జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది.
3 రోజుల్లో 7వసారి..
ఎన్సీఎస్ డేటా ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటలకు.. కాట్రాలో తొలిసారి భూమి కంపించింది. భూమికి 10కి.మీల దిగువన ప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైంది.
Jammu Kashmir earthquake : ఇక జమ్ముకశ్మీర్లో భూకంపం.. రెండోసారి మంగళవారం తెల్లవారుజామునే నమోదైంది. దోడా ప్రాంతంలో వచ్చిన భూకంపం.. రికార్ట్ స్కేలుపై 2.6 తీవ్రతగా ఉంది. మూడోవది.. అదే రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు సంభవించింది. తీవ్రత.. రిక్టార్ స్కేలుపై 2.8గా నమోదైంది.
జమ్ముకశ్మీర్లో నాలుగో భూకంపం.. మంగళవారం ఉదయం.. ఉధంపూర్కు ఆగ్నేయం దిశగా వచ్చింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 2.9గా నమోదైంది.
ఆ తర్వాత.. జమ్ముకశ్మీర్లో ఐదవ భూకంపం.. బుధవారం వెలుగులోకి వచ్చింది. కాట్రాలో రాత్రి 11:04 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. కొన్ని నిమిషాల తర్వాత.. అంటే 11:52 గంటలకు.. కాట్రాలోనే మరోమారు భూకంపం నమోదైంది.
మహారాష్ట్రలో కూడా..
Maharashtra earthquake : మహారాష్ట్రలో సైతం భూకంపం సంభవించింది. మొత్తం మీద.. 48 గంటల వ్యవధిలో రెండుసార్లు అక్కడ భూమి కంపించింది.
శుక్రవారం 2:21 గంటలకు.. 3.9 తీవ్రతతో మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. భూమికి 10కి.మీల దిగువన భూమి కంపించింది. గురువారం కోల్హాపూర్లో 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది.
దేశంలో భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే.. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో భూకంపం సంభవించింది. గత శనివారం తెల్లవారుజామున భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ప్రకారం.. రిక్టార్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. భూమి నుంచి 82 కిలోమీటర్ల దిగువన భూప్రకంపనలు నమోదయ్యాయి. లక్నోలోని ఉత్తర- ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది.
Earthquake in Lucknow : లక్నో భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
శనివారం 1:12 గంటలకు లక్నో భూకంపం నమోదైంది.
ఈ ఘటనకు ఒకరోజు.. అంటే గత శుక్రవారమే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టార్ స్కేలుపై 3.6గా నమోదయ్యాయి. మిట్ట మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
జమ్ముకశ్మీర్లోనూ 3.1 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవించింది.