తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid-19 Vaccine: విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్‌ డోస్.. !

COVID-19 Vaccine: విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్‌ డోస్.. !

HT Telugu Desk HT Telugu

27 March 2022, 6:34 IST

    • కొవిడ్ 19 బూస్టర్ డోస్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. విద్య, ఉద్యోగం, క్రీడలు, అధికారిక క పర్యటనలకు వెళ్లే వారికి వెళ్లేవారికి బూస్టర్‌ డోసును ఇవ్వాలని చూస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
విదేశాలకు వెళ్లేవారికి టీకా బూస్టర్‌ డోసు
విదేశాలకు వెళ్లేవారికి టీకా బూస్టర్‌ డోసు

విదేశాలకు వెళ్లేవారికి టీకా బూస్టర్‌ డోసు

కొవిడ్ బూస్టర్ డోసు పరిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు విద్య, ఉద్యోగాలు, వ్యాపారం ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లే వారికి అతి త్వరలోనే ముందస్తు టీకా పంపిణీని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటంతో ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్ డోసును తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

దేశంలో 60 ఏళ్లు దాటిన వారితోపాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఇప్పటికే బూస్టర్‌ డోసు ఇస్తున్నారు. ప్రస్తుత మార్గదర్శకాల మేరకు రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవాలి. కానీ పలు దేశాలు నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్న పరిస్థితుల్లో కేంద్రం విదేశాలకు వెళ్లే వరకు త్వరగా బూస్టర్ డోసులను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

 

తదుపరి వ్యాసం