CEO kills son : కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్ సంస్థ సీఈఓ- శరీరాన్ని బ్యాగ్లో కుక్కి..!
09 January 2024, 11:27 IST
- CEO kills son : బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ సీఈఓ సుచన సేత్.. తన 4ఏళ్ల బిడ్డను చంపేసింది! పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది.
కుమారుడిని చంపిన ప్రముఖ స్టార్టప్ సంస్థ సీఈఓ
CEO kills son in Goa : గోవాలో దారుణ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ స్టార్టప్ సంస్థ సీఈఓ.. తన బిడ్డను చంపేసింది. ఆమెను పోలీసులు కర్ణాటకలో పట్టుకున్నారు.
ఇదీ జరిగింది..
బెంగళూరుకు చెందిన మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న సుచన సేత్.. గత శనివారం, తన చిన్న కుమారుడితో కలిసి గోవాకు వెళ్లింది. అతని వయస్సు 4ఏళ్లు. శనివారం మధ్యాహ్నం సమయంలో.. ఉత్తర గోవా కండోలిమ్లోని ఓ హోటల్లో దిగింది. సోమవారం చెక్ఔట్ చేసింది. చేతిలో ఓ బ్యాగ్ పట్టుకుని, బెంగళూరుకు ట్యాక్సీని బుక్ చేయాలని హోటల్ సిబ్బందికి చెప్పింది. 'బెంగళూరు వరకు ట్యాక్సీ ఆ? ఫ్లైట్లో వెళ్లండి,' అని హోటల్ సిబ్బంది సూచించగా.. 'వద్దు. ట్యాక్సీలోనే వెళతాను,' అని ఆమె సమాధానం ఇచ్చింది.
Mindful AI Lab CEO kill son : అదే సమయంలో.. ఆమె పక్కన బాలుడు కనిపించకపోవడాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. ఇంతలో ట్యాక్సీ వచ్చింది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంతసేపటికి.. సుచన సేత్ ఉన్న రూమ్లోకి వెళ్లిన హౌజ్ క్లీనింగ్ స్టాఫ్కి.. నేల మీద రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే హోటల్ సిబ్బందిని అలర్ట్ చేశారు. వారు పోలీసులకు ఫోన్ చేశారు.
హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ సంస్థ సీఈఓకు ఫోన్ చేశారు. బులుడి గురించి ప్రశ్నించారు. "నా బిడ్డ.. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు," అని ఒక అడ్రెస్ చెప్పింది. కొంతసేపటికి.. అది ఫేక్ అడ్రెస్ అని తెలుసుకున్నారు పోలీసులు. అనంతరం.. సుచన సేత్ ఎక్కిన ట్యాక్సీ డ్రైవర్కి ఫోన్ చేసి.. ఆమెకు అర్థం కాని కోంకణ్ భాషలో మాట్లాడారు. ట్యాక్సీని చిత్రదుర్గకు సమీపంలోని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని చెప్పారు. పోలీసులు చెప్పినట్టు చేశాడు ఆ ట్యాక్సీ డ్రైవర్.
Mindful AI Lab CEO Suchana Seth : అనంతరం.. సుచన సేత్ని పోలీసులు పట్టుకున్నారు. ఆమె బ్యాగ్లో బాలుడి మృతదేహం కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ సీఈఓను అరెస్ట్ చేశారు.
సుచన సేత్.. బాలుడిని ఎందుకు చంప్పింది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే ఇతర వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
ఎవరు ఈ సుచన సేత్..?
Suchana Seth kills son : మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ సీఈఓ సుచన సేత్.. "2021 టాప్ 100 బ్రిలియెంట్ ఉమెన్ఇన్ ఏఐ అథిక్స్"లో ఒకరు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన బెర్క్మన్ క్లెయిన్ సెంటర్లో చదువుకున్నట్టు సుచిత సేత్ లింక్డ్ఇన్ బయో సూచిస్తోంది. ఆమె ఒక డేటా సైంటిస్ట్. డేటా సైన్స్ టీమ్ మానిటరింగ్లో ఆమెకు 12ఏళ్ల అనుభవం ఉంది.