తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత్​కు చేరిన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు

భారత్​కు చేరిన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు

HT Telugu Desk HT Telugu

27 January 2022, 14:33 IST

    • Arunachal teen missing case | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని.. చైనా సైన్యం భారత్​కు అప్పగించింది. భారత సైన్యం విజ్ఞప్తి మేరకు యువకుడి కోసం గాలించిన చైనా పీఎల్​ఏ, చివరికి అతడి వివరాలు సేకరించి విడుదల చేసింది.
భారత్​కు చేరిన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు
భారత్​కు చేరిన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు (Hindustan times)

భారత్​కు చేరిన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడు

China PLA India | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్​ప్రదేశ్​ యువకుడిని చైనా సైన్యం గురువారం భారత్​కు అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్​ రిజిజు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

"చైనా పీఎల్​ఏ.. మిరామ్​ తారోన్​ను భారత సైన్యానికి అప్పగించింది. ప్రస్తుతం సైన్యం అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది," అని రిజిజు ట్వీట్​ చేశారు.

అపహరించారా.. అదృశ్యమయ్యాడా?

అరుణాచల్​ప్రదేశ్​ షియాంగ్​లోని సియుంగ్లాలో మిరామ్​ తారోన్​ అనే 19ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్​ అదృశ్యమవ్వలేదని, పీఎల్​ఏ(పిపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) అతడిని అపహరించిందని అరుణాచల్​ప్రదేశ్​లోని బీజేపీ ఎంపీ తాపిర్​ గావో ఆరోపించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్​ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తారోన్​ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్​ఏకు అధికారులు ఇచ్చారు.

ఈ విషయంపై భారత సైన్యం- పీఎల్​ఏ మధ్య బుధవారం సంభాషణ జరిగింది. యువకుడిని త్వరలోనే అప్పగిస్తామని పీఎల్​ఏ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిజిజు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

తదుపరి వ్యాసం