తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugc Scholarship 2022: ఉన్నత చదువుల కోసం Ugc స్కాలర్‌షిప్‌లు ఇలా అప్లై చేసుకోండి!

UGC Scholarship 2022: ఉన్నత చదువుల కోసం UGC స్కాలర్‌షిప్‌లు ఇలా అప్లై చేసుకోండి!

HT Telugu Desk HT Telugu

18 August 2022, 21:06 IST

    • విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ వివిధ రకాల స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత చదువులు అభ్యసించేందుకు వీలుగా ఇటువంటి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను UGC నిర్వహిస్తుంది.
UGC Scholarship 2022
UGC Scholarship 2022

UGC Scholarship 2022

UGC Scholarship 2022: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వివిధ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తుంది. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించేందుకు వీలుగా ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లను UGC అందిస్తుంది. అయితే, ఈ స్కాలర్‌షిప్‌లను పొందడానికి, విద్యార్థులు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. UGC స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) అధికారిక వెబ్‌సైట్ నేషనల్ www.ugc.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.

1- SC / ST PG స్కాలర్‌షిప్ ( Scholarship for SC/ST)

ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. విద్యా సంస్థల్లో రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఈ స్కాలర్‌షిప్ అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్ పొందే విద్యార్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రొఫెషనల్ కోర్సును కొనసాగించడం తప్పనిసరి. దీని కింద విద్యార్థులకు రూ.4,500, ఎంటెక్ లేదా ఎంఈ చదివే విద్యార్థులకు రూ.7,800 అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2- ఇందిరా గాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ PG స్కాలర్‌షిప్ ((Indira Gandhi Single Girl Child PG Scholarship))

తల్లిదండ్రుల ఏకైక సంతానం కలిగిన బాలికలకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ ఇవ్వబడుతుంది. ఈ స్కాలర్‌షిప్ లక్ష్యం వీలైనంత ఎక్కువ మంది బాలికలకు ఉన్నత విద్యను అందించడం. ఏకైక సంతానం ఉన్న తల్లిదండ్రులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద విద్యార్థులకు ఏడాదికి రూ.36,200 అందజేస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2022.

3- ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్

ఈశాన్య భారతదేశంలోని విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా లెక్కల ఆధారంగా ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య స్కాలర్‌షిప్ స్లాట్ల పంపిణీ జరుగుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షలకు మించకూడని విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. దీని కింద ప్రతి సంవత్సరం 10,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందించబడుతుంది. సాధారణ డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థి అయితే రూ.5,400, టెక్నికల్ లేదా మెడికల్ కోర్సు చదివే విద్యార్థి అయితే రూ.7,800 ఇస్తారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 అక్టోబర్.

తదుపరి వ్యాసం